ఆన్లైన్ ఉద్యోగాల పేరుతో జరిగే మోసాల పట్ల నిరుద్యోగ యువత అప్రమత్తంగా ఉండాలని, అలాగే ఖాళీ సమయాలలో పనిచేసి అదనపు ఆదాయం ఆర్జించమంటూ ఆన్లైన్ ఉద్యోగాల పేరుతో జరిగే మోసాలకు ప్రజలు గురికాకుండా తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణకాంత్ ఐపియస్ గారు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకొని కొందరు వ్యక్తులు పలు ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని , కానీ ప్రాసెస్సింగ్, రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలని నమ్మబలికి డబ్బులు వసూలు చేసి మోసం చేస్తారని, కొందరు అయితే ఏకంగా ఫేక్ ఇంటర్వ్యూలు నిర్వహించి, ప్రాంగణ ఎంపికలు చేసేలా నటించి, సొమ్ము అందగానే పత్తా ఉండరని, అలాగే ఉద్యోగులు, అలాగే గృహిణిలు ఇంటి వద్దే ఉంటూ ఖాళీ సమయాలలో పనిచేస్తూ అదనపు ఆదాయం సంపాదించండి” వంటి ఆకట్టుకునే ప్రకటనలు చూసి ఆర్థిక కష్టాలు కొంతైనా తీరతాయని నమ్మి మోసపోతారని, నిరుద్యోగులు జాబ్ పోర్టల్స్ లో రెజ్యూమెలు అప్ లోడ్ చేస్తుంటారని,